PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జి.పుల్లయ్య ఎంబీఏ విద్యార్థుల ప్రతిభ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక వెంకయ్య పల్లి లోని జీ.పులయ్య ఇంజనీరింగ్ కళాశాల ఎంబీఏ విద్యార్థులు కేవీ సుబ్బారెడ్డి స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ వారు నిర్వహించిన నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్ ఉన్నతి- 2024 లో ప్రతిభ కనపరిచారు. రెండు రోజులు నిర్వహించిన నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్ పోటీలలో జి.పుల్లయ్య ఎంబీఏ విద్యార్థులు హెచ్ ఆర్ యాక్టివిటీలో మొదటి బహుమతి జి.శ్రావణి కె.ప్రీతి ఎం.పల్లవి అందుకున్నారు. ఫైనాన్స్ యాక్టివిటీలో రెండవ బహుమతి ఎండి.బుష్రా, మహీన్ చాందిని బేగం బహుమతిని అందుకున్నారు. మరియు మిస్ ఉన్నతి మొదటి బహుమతి టి. ఈశ గెలుచుకున్నారు. ఇందులో భాగంగా కాలేజ్ నిర్వహించిన అభినందన సభలో డాక్టర్ సి. శ్రీనివాసరావు ప్రిన్సిపల్ విద్యార్థులను అభినందించారు అలాగే ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని మరిన్ని పోటీలలో విద్యార్థులను పాల్గొనాలని వాళ్లకు కితాబ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీన్ అడ్మిన్ డాక్టర్ ఎం.గిరిధర్ కుమార్ మరియు డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ శశి కుమార్ పాల్గొన్నారు.

About Author