NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వ్యాసరచన పోటీలో ‘ లిటిల్’ విద్యార్థుల ప్రతిభ

1 min read

పల్లెవెలుగు వెబ్​, వెలుగోడు: మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా లిటిల్ ఏంజెల్ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో పదవ తరగతి విద్యార్థిని సునీనా తబుసూమ్ మొదటి బహుమతి సాధించిందని పాఠశాల కరస్పాండెంట్ ఇమ్మానియేల్ తెలిపారు.  శుక్రవారం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల 6 నుండి 10 వ తరగతి  విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారని అన్నారు. అందులో 6 7 8 వ తరగతి  విద్యార్థులకు జూనియర్ విభాగంలో మొదటి బహుమతి  లిటిల్ విద్యార్థిని మధు నయన శ్రీ,  జిబిఎం విద్యార్థులు లావణ్య, సుజాత 9,10 సీనియర్ విభాగంలో లిటిల్ విద్యార్థులు మొదటి రెండవ బహుమతులు సునినా, అంజలి,  మూడో బహుమతి  జీపీఎం పాఠశాల విద్యార్థిని బ్రహ్మీణి గెలుపొందారని తెలిపారు.  గెలుపొందిన విద్యార్థులకు బృందావనం,జిబిఎం పాఠశాల కరస్పాండెంట్ ఫయాజ్ అలి ఖాన్, చంద్రశేఖర్ రెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిల్, అపియ ప్రశాంత పాల్గొన్నారు.

About Author