PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార‌త హెలీకాప్టర్ లాక్కున్న తాలిబ‌న్లు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆప్ఘనిస్థాన్ దేశానికి భార‌త దేశం బ‌హుమ‌తిగా ఇచ్చిన హెలీకాప్టర్ ను తాలిబ‌న్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబ‌న్లు ఈ హెలీకాప్టర్ ముందు నిల‌బ‌డి ఫోటోలు తీసుకుంటున్నారు. ఆఫ్గన్ ద‌ళాల‌కు భార‌త్ ఈ హెలీకాప్టర్ బ‌హుమ‌తిగా ఇచ్చింది. అయితే తాలిబ‌న్లు ఈ హెలీకాప్టర్ ను వినియోగంచ‌డానికి వీలులేకుండా ఆఫ్గన్ బ‌ల‌గాలు రోటార్ బ్లేడ్లను తొల‌గించిన‌ట్టు తెలుస్తోంది. ఎంఐ-24 అటాక్ హెలీకాప్టర్ ను , మూడు చీతా లైట్ హెలీకాప్టర్లను భార‌త్ 2019లో ఆఫ్గన్ వాయిసేన‌కు బ‌హుమ‌తిగా ఇచ్చింది. ఆప్ఘన్ లో 65 శాతం మేర‌కు భూభాగాన్ని తాలిబ‌న్లు స్వాధీనం చేసుకున్నారు.

About Author