PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోజూ శ్రీకృష్ణుడితో మాట్లాడుతా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ, స‌మాజ్ వాదీ పార్టీలు హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో రాజ‌కీయాల్ని వేడెక్కించాయి. సమాజ్‌వాది పార్టీలో క్రిమినల్స్‌, గ్యాంగ్‌స్టర్లున్నారనే బీజేపీ ఆరోపణలపై.. అఖిలేష్‌ యాదవ్‌ ఘాటుగా స్పందించారు.బీజేపీ నేరస్థులను, మాఫియా డాన్‌లను ప్రక్షాళన చేయడానికి వాషింగ్‌మెషిన్‌లను కొనుగోలు చేసిందా అంటూ వ్యంగ్యంగా స్పందించారు. శ్రీ కృష్ణుడు ప్రతిరోజు తనకలలో వస్తారని.. తాను రోజు ఆయనతో మాట్లాడతానన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌ వాది పార్టీ గెలుస్తుందని కృష్ణుడు కూడా అన్నారని పేర్కొన్నారు.

                                    

About Author