PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ నా భార్య గురించి మాట్లాడారు.. బాధ‌గా అనిపించింది ’

1 min read

పల్లెవెలుగు వెబ్ : మాజీ ముఖ్య‌మంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుప‌తిలోని వ‌ర‌ద బాధితుల్ని పరామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. ఏపీ శాసనసభను కౌరవ సభగా మార్చారని.. తాను మళ్లీ గౌరవ సభగా మార్చి ఆ సభకే వస్తానని  చంద్రబాబు తెలిపారు.  ‘‘నా సతీమణి గురించి మాట్లాడారు.. బాధనిపించింది. ఎన్టీఆర్‌ బిడ్డ వ్యక్తిత్వాన్ని కించపరిచారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి. ప్రజల్లోకి వెళ్దాం.“ అంటూ స‌వాల్ విసిరారు.  ఇది ప్రజాస్వామ్యం.. ఉన్మాదుల స్వామ్యం కాదుని అన్నారు. తప్పుడు పనులు చేసినవారిని ఎవరినీ వదిలిపెట్టనని.. అలిపిరిలో మందుపాతరలకే నేను భయపడలేదని చెప్పారు.  తాము ఉన్నామని మనోధైర్యం ఇచ్చేందుకు వచ్చానని తెలిపారు. 

About Author