NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పన్నుల పెంపు తగదు..!

1 min read

– 1న కర్నూలు మున్సిపల్​ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకుంటాం
– బీజేపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు రామస్వామి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: మున్సిపల్​ పన్ను పెంపునకు సంబంధించి జూలై 1న (గురువారం) ఆమోదించడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని, పన్ను పెంపుపై ఆమోదించడానికి నిర్వహించే కర్నూలు మున్సిపల్​ సమావేశాన్ని అడ్డుకుంటామని బీజేపీ కర్నూలు పార్లమెంట్​ జిల్లా అధ్యక్షులు రామస్వామి ఉద్ఘాటించారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామస్వామితోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కగ్గోలు హరిపష్ బాబు,రాష్ట్ర నాయకులు పూల రంగస్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబిలి కాశీ విశ్వనాథ్, కార్యదర్శి వెంకటహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ కరోన కష్టకాలంలో ఉపాధి లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆస్తి, ఇంటి పన్ను పెంచాలని, చెత్తపన్ను వేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. ఏపీ సీఎం జగన్​ నిర్ణయాన్ని నిరసిస్తూ…. గురువారం జరిగే మున్సిపల్​ కౌన్సిల్​ సమావేశాన్ని అడ్డుకుంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

About Author