PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు ప్రజ‌ల నీటి క‌ష్టాలు తీర్చాల‌ని అల్లాను ప్రార్థించా.. టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూలు నియోజకవర్గ ప్రజ‌లు ఎదుర్కొంటున్న నీటి క‌ష్టాలు తీర్చాల‌ని అల్లాను ప్రార్థించిన‌ట్లు క‌ర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్ చెప్పారు. న‌గ‌రంలోని పాత ఈద్గాలో ఆయ‌న ఈద్ ఉల్ ఫిత‌ర్ సంద‌ర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన‌ల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ముస్లిం సోద‌రుల‌ను క‌లిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ, ముస్లిం, క్రిస్టియ‌న్ తేడా లేకుండా అన్ని పండుగలను ప్రజ‌లంద‌రూ క‌లిసి జ‌రుపుకోవ‌డం క‌ర్నూలు ప్రజల గొప్పత‌నమ‌ని తెలిపారు.

About Author