PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాబుకు బెయిల్​…టీడీపీ సంబరాలు

1 min read

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో:తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు న్యాయస్థానం మధ్యంతర బెయిల్  ఇచ్చిన సందర్భంగా చిన్నమండం లో టీడీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు ఏర్పాటుచేసిన రామలింగేశ్వర ఆలయంలో మరియు స్థానిక  పీర్ల మఖాన్ లో పూజలు,ప్రార్థనలు కార్యక్రమానికి మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొని మాట్లాడుతూ చంద్రబాబు గారికి హైకోర్టు మధ్యంతర బెయిలు ఇవ్వడం తెలుగు ప్రజలకు ఆనందదాయకం, సంపూర్ణ ఆరోగ్యంతో.. రెట్టింపు ఉత్సాహంతో.. రాబోయే ఎన్నికలలో తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఎన్నికై ప్రజా సేవకు పునరంకితం కావాలని, వారి అనుభవం ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత ముందుకు ప్రగతి పథంలో ముందుకు నడపాలని,రాయచోటి నియోజకవర్గంలో 52 రోజులుగా వివిధ మండలాల్లో,గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో కుల మతాలకు అతీతంగా  *శ్రీ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నిలిచిన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు  సానుభూతి వ్యక్తపరిచిన నాయకులకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ శ్రేణులకు, తన కృతజ్ఞతాభివందనములు తెలియజేశారు.ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లికార్జున.జిల్లా మైనారిటీ నాయకుడు ఇర్షాద్ ఖాన్,సుగవాసి శ్రీనివాసులు, మండల తెలుగు యువత అధ్యక్షుడు తౌహీద్ ఖాన్.బాలచంద్రాయాదవ్.రైసుమిల్ శంకర,సిద్దయ్య,ఫిరోజ్,మస్తాన్.సైఫుల్లా ఖాన్.వాజీద్.సాదిక్.రాంప్రసాద్ నాయుడు,మల్ రెడ్డి.బాబ్జాన్.నావాజ్.హయాతి,నవాజ్, శాదక్, మన్నేరు రామాంజనేయులు,బడిశెట్టి రవి,మనోహర్,సహడేవా,కోటి,తదితరులు పాల్గొన్నారు.

About Author