PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రిపై టీడీపీ ఫిర్యాదు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: పశు సంవర్ధక శాఖ మంత్రి శీదిరి అప్పల రాజుపై ఆదివారం కర్నూలులో టీడీపీ నాయకులు ఒకటవ పట్టణ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఓ ఛానల్​ డిబెట్​లో కర్నూలులో N44OK అనే కొత్త వైరస్ వేరియంట్ పుట్టిందనీ, అది కరోనా కంటే అది 10 నుండి 15 రేట్లు తీవ్రంగా వ్యాప్తి చెంది మానవ నష్టం జరుగుతుందనీ, సామాన్య జనాలు భయానికి గురయ్యే విధంగా మంత్రి వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అమాత్యుల మాటల వల్ల కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్​ ప్రజలు వైరస్​కు భయపడి మానసిక ఒత్తిడికి లోనై చనిపోయే ప్రమాదం ఉందని, మంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్​ స్టేషన్​లో టీడీపీ నాయకులు పోతురాజు రవికుమార్​, 3వ పట్టణ పోలీస్​ స్టేషన్​లో ధరూర్​జేమ్స్​ అలియాస్​ శ్రీనివాసులు, ఎమ్మిగనూరు పోలీస్​ స్టేషన్​లో న్యాయవాది జయన్న ఫిర్యాదు చేశారు.

About Author