PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన టిడిపి

1 min read

నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు దేవమ్మ

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు డా బి వి జయనాగేశ్వర రెడ్డి  ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు దేవమ్మ ల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడటం జరిగినది. ఈ సందర్భంగా వారు ముందుగా తెలుగుదేశం పార్టీ తరపున మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో పాటు నియోజకవర్గ ప్రజలందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసినారు. మహిళా సాధికారత దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు , జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ ల మరో కీలక ముందడుగు వేశారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం కలలకు రెక్కలు అనే సరికొత్త పథకాన్ని తీసుకువచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి టిడిపి – జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్టంలో ఏ ఆడబిడ్డ కూడా చదువుకు సంభందించి డబ్బుల కొరతతో ఇంటికి పరిమితం కాకూడదనే ఏకైక లక్ష్యంతో కలలకు రెక్కలు అనే నూతన పథకాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు.  ఏ తెలుగింటి ఆడబిడ్డ కూడా  నిధుల కొరత కారణంగా తమ కలలతో రాజీ పడాల్సిన అవసరం లేదన్నారు. ఈ పథకం కింద కోర్సుల కోసం మహిళలు తీసుకునే బ్యాంక్ ఋణానికి టిడిపి – జనసేన ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ వడ్డీ ని కూడా చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం కింద అర్హత ఉన్న మహిళలు దేశంలో ఎక్కడైనా తమకు నచ్చిన ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు పద్మ, బడే బి, సరోజమ్మ, శంకరమ్మ, అమీనమ్మ, పద్మమ్మ, వరలక్ష్మి, నాగవేణి,రంగమ్మ, సత్యమ్మ, హనుమంతమ్మ, రేష్మ, ఉమాదేవి, అచ్చమ్మ, ఖాజా బి తదితరులు పాల్గొన్నారు.

జనసేన, సమావేశం, నిధులు,

About Author