PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌ద్యం మాఫియా పై టీడీపీ ప్ర‌త్యేక వెబ్ సైట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మ‌ద్యం మాఫియా పై టీడీపీ వినూత్న ప్ర‌చారం మొద‌లుపెట్టింది. మద్యంపై సామాజిక మాద్యమాల ద్వారా డిజిటల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నాటుసారాను నిర్మూలించాలని, ప్రభుత్వ దుకాణాల్లో జె బ్రాండ్‌ మద్యం అమ్మకాలను నిలిపివేయాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. మద్యం దుకాణాల వద్ద నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. ‘జె బ్రాండ్‌ పాపం.. ప్రజల ఆరోగ్యానికి శాపం’, ‘జె-బ్రాండ్‌ పోవాలి.. జగన్‌రెడ్డి దిగిపోవాలని’ అనే నినాదంతో టీడీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే మద్యం మాఫియాపై ప్రత్యేక వెబ్‌సైట్‌‌ను టీడీపీ రూపొందించింది. www.killerjbrands.comపేరిట టీడీపీ వెబ్‌సైట్‌ ప్రారంభించింది. మద్యం పేరుతో దోపిడీ, మరణాల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచుతామని, డిజిటల్‌ క్యాంపెయిన్‌లో ప్రజలు భాగస్వాములు కావాలని టీడీపీ నేత నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు.

                                       

About Author