PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

15వ రోజు కొనసాగిన టిడిపి నిరాహార దీక్షలు 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు రిమాండ్లకు నిరసనగా కొనసాగుతున్న టిడిపి నిరాహార దీక్షలు బుధవారం నాటికి 15వ రోజుకు చేరుకున్నాయి.  పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి కే.ఈ.శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక నాలుగు స్తంభాల గుడి వద్ద ఏర్పాటుచేసిన నిరాహార దీక్ష శిబిరంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కే సాంబశివారెడ్డి మాట్లాడారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడును అక్రమ అరెస్ట్, రిమాండ్  తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. అలాంటి నికార్సైన నాయకున్ని రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయించి నిర్బంధాలు విధించడం సరైన పద్ధతి కాదు అని అన్నారు. చంద్రబాబు మచ్చలేని నాయకుడిగా న్యాయవ్యవస్థలో నిరూపించుకొని తిరిగి బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి నాయకులు వాస్తవాలు గ్రహించి నడుచుకోవాలని సూచించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ బాబు గారికి తోడుగా ఒక్క నియంతపై  పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్షల్లో  రెడ్ల సామాజిక వర్గానికి చెందిన టిడిపి శ్రేణులు రీలే దీక్షలు చేపడుతున్న వారికీ సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు ప్రమోద్ కుమార్ రెడ్డి, ఎం అశోక్ కుమార్, రామానాయుడు, తిరుపాలు, తిప్పన్న, హోసూరు శ్రీనివాసులు, మనోహర్ చౌదరి, శ్రీధర్ రెడ్డి, విజయ మోహన్ రెడ్డి, సంజప్ప,గుడిసె నరసింహులు, బిటి గోవిందు, సింగం శ్రీనివాసులు, మీరా హుస్సేన్, ఉచ్చూరప్ప, సురేంద్ర, శ్రీనివాసులు గౌడు, గోవిందు గౌడు, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

About Author