PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌హిళ‌ల అభ్యున్న‌తి కోసం కృషి చేస్తా.. టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్

1 min read

టి.జి భ‌ర‌త్‌కు మ‌ద్ద‌తిచ్చి టిడిపిలో చేరిన మ‌హిళ‌లు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూల్లోని మ‌హిళ‌ల అభ్యున్న‌తి కోసం తాను కృషి చేస్తాన‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి టి.జి భ‌ర‌త్ హ‌మీ ఇచ్చారు. న‌గ‌రంలోని 5వ వార్డు చిత్తారివీధికి చెందిన మ‌హిళ‌లు.. టిడిపి నాయ‌కురాలు ల‌లిత‌మ్మ ఆధ్వ‌ర్యంలో మౌర్య ఇన్‌లోని టి.జి భ‌ర‌త్ కార్యాల‌యంలో ఆయ‌న‌కు మ‌ద్ద‌తిచ్చి పార్టీలో చేరారు. భ‌ర‌త్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌లు మాట్లాడుతూ టి.జి భ‌ర‌త్ గెలుపుతో క‌ర్నూలు ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం త‌మ‌కుంద‌న్నారు. అందుకే తామంతా టి.జి భ‌ర‌త్ వెంట న‌డిచేందుకు వ‌చ్చామ‌ని తెలిపారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ క‌ర్నూల్లో ఉన్న మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త‌, ఆర్థిక భ‌రోసా క‌ల్పించడం త‌న బాధ్య‌త‌గా తీసుకుంటాన‌ని చెప్పారు. ప్ర‌తి మ‌హిళ ఆదాయం పెంచేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తాన‌న్నారు. మ‌హిళ‌లకు స్వ‌యం ఉపాధి క‌ల్పిస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తాన‌ని తెలిపారు. కొత్త ప‌రిశ్ర‌మ‌లు తీసుకొచ్చి చ‌దువుకున్న వారికి ఉద్యోగాల‌తో పాటు చ‌దువులేని వారికి సైతం ఉపాధి క‌ల్పించేందుకు కృషి చేస్తాన‌ని భ‌ర‌త్ అన్నారు. అర్హుల‌కు ఇల్లు, ఇళ్ల ప‌ట్టాలు అందిస్తాన‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌హిళా నాయ‌కురాళ్లు రాజ్య‌ల‌క్ష్మి, విజ‌య‌ల‌క్ష్మి, త‌దిత‌రులు ఉన్నారు.

About Author