PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కరోన బాధితులను ఆదుకోవాలని టీడీపీ దీక్ష

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి: కరోనా బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి మండల మాజీ కన్వీనర్ వెంకటేశ్వర్లు , మాజీ సొసైటీ డైరెక్టర్ కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ… టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తలపెట్టిన సాధన దీక్షకు మద్దతుగా మంగళవారం ఆస్పరి గాంధీ పార్క్​లో నిరసన దీక్ష చేపట్టారు. ఆలూరు టిడిపి ఇన్చార్జ్ కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు నిర్వహించిన దీక్షలు వారు మాట్లాడారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో మరణించిన వారికి రూ.25 లక్షలు పరిహారం, వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని కాపాడాలన్నారు. కోవిడ్ కారణంగా పేద మధ్యతరగతి ప్రజలు ఉపాధి కోల్పోయారని , వారికి ఉపాధి కల్పించి తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేస్తున్నా విలేకరులకు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్​ చేశారు. టిడిపి సీనియర్ నాయకులు తిమ్మన్న ,ముత్యాల రెడ్డి ,శ్రీనివాస్ గౌడ్ , శేషాద్రి నాయుడు ,రాజ్ కుమార్, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్, ఆంజనేయ ,వీరేశ్ ,రహంతుల్లా, మారేష్ ,బాలు, విరేష్ , రంగస్వామి ,శంకరయ్య, తలారి అంజనేయ, రామాంజనేయులు ,రవి, ఉపేంద్ర, యాదవ్ ,జూనియర్ ఎన్టిఆర్ సేవ సమితి సభ్యులు వెంకట్రాముడు పాల్గొన్నారు.

About Author