NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాయచోటిలో ‘టీడీపీ’ బాదుడే బాదుడు

1 min read

పల్లెవెలుగువెబ్​, అన్నమయ్య జిల్లా (రాయచోటి): అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో   తెలుగుదేశం నాయకులు గాజులు ఖాదర్ బాషా మరియు పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదర్ వల్లి ఆధ్వర్యంలో  బాదుడే బాదుడు  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజులఖాదర్ బాషా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న పేద ,మధ్యతరగతి, ప్రజల నడ్డి విరుస్తూ విద్యుత్ చార్జీలు నిత్యవసర వస్తువులు పెట్రోలు డీజిల్ ప్రతి వస్తువుపై అధిక ధరలు పెంచి పేద ప్రజల, నడ్డి విరుస్తున్నారు అని ప్రజలకు వివరించారు. ధర పెరుగుదలతో పాటు ఇంట్లో భారీ ఖర్చు వస్తుందని దీంతో రైతుల అప్పులు పాలు కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు వివరించారు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అభ్యర్థులని బలపరిచి ముఖ్యమంత్రి చేయాలని ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బోనముల ఖాదర్ వలీ, అతావుల్లాతెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author