PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయం       

1 min read

– టిడిపి పత్తికొండ ఇంచార్జ్ కేఈ శ్యాం కుమార్ ధీమా                                                           

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయమని పత్తికొండ టిడిపి ఇన్చార్జి కేయి. శ్యామ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం  పత్తికొండ టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రాజెక్టుల సందర్శనకు ప్రజల నుండి వస్తున్న అపూర్వ స్పందన చూసి ముఖ్యమంత్రి కి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని అన్నారు.ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో చంద్రబాబు నాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే వైసిపి వాళ్లు చిల్లర చేష్టలతో అడ్డుకునే ప్రయత్నం చేసినా వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని అన్నారు.అమరావతిలో ఆర్ ఫైవ్ జోన్ లో జగనన్న కాలనీలు నిర్మించకూడదని కోర్టు స్టే విధించడం వైసిపి ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు.రాబోయే రోజుల్లో రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టి,  రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్ని పూర్తిచేసి, ప్రతి ఒక ఎకరాకు నీళ్లు ఇస్తాం అని అన్నారు.పత్తికొండ నియోజకవర్గం లో గత టిడిపి ప్రభుత్వంలో హంద్రీనీవా ద్వారా 68 చెరువులకు నీరు నింపే పనులు 75% పూర్తి చేస్తే, ఈ వైసీపీ ప్రభుత్వంలో మిగిలిన 25 శాతం పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పత్తికొండ ప్రాంతంలోని 68 చెరువులకు నీటిని నింపుతామన్నారు. ఈ కార్యక్రమంలో  టిడిపి నాయకులుమనోహర్ చౌదరి, దివాకర్ రెడ్డి,రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author