NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపితోనే సమస్యలకు పరిష్కారం.. టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని 9 వ వార్డులోని గౌలి వీధి, పింజరి వీధిలో ఆయన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం చేపట్టి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. మహిళలు, వ్రుద్దులు, యువతతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని భరత్ ప్రజలను కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివ్రుద్ది చెందుతుందని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారని అన్నారు. టిడిపి వస్తే ప్రజలకు అంతా మేలు జరుగుతుందన్నారు. ఇండస్ట్రియల్ జోన్ ఉన్న కర్నూల్లో పరిశ్రమలు రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు వస్తే ఇక్కడి ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఫార్మా కంపెనీలు తెచ్చేందుకు ఇప్పటి నుండే ఒక ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. ప్రజలు అన్నీ ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. కర్నూలు ప్రజలకు మేలు చేసేందుకే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు భరత్ తెలిపారు. అనంతరం గౌరిగోపాల్ హాస్పిటల్ లో ఉచితంగా చేయిస్తున్న వైద్య పరీక్షల కరపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ప్రజలు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని.. ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేయాలని భరత్ ను కోరారు. ఈ కార్యక్రమంలో టిటిడి నేతలు శేషగిరి శెట్టి, సముద్రాల శ్రీధర్, చేపల రమేష్, శ్రీనివాసులు, రమేష్ రావ్, ఫరత్, రాజేశ్వరమ్మ, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

About Author