PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భవిష్యత్​…టీడీపీ, జనసేనదే.. :టీజీ భరత్​

1 min read

– ఉమ్మడి మేనిఫెస్టోతో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం

  • మౌర్య ఇన్​లో  టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశం

కర్నూలు:తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన పార్టీ నేతలందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ కలిసి కట్టుగా ప్రజల్లోకి వెళతామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని మౌర్య ఇన్ లో టి.జి భరత్ అధ్యక్షతన టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టి.జి భరత్ తో పాటు, అబ్జర్వర్ శ్రీనివాసమూర్తి, జనసేన నేతలు హర్షద్ పాల్గొని భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఈ సందర్బంగా టి.జి భరత్ మాట్లాడుతూ ఇరు పార్టీల ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో జనసైనికులు కూడా పాల్గొనాలన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలన్నారు. టిడిపితో కలిసి పనిచేస్తున్న జనసైనికులకు తగిన గౌరవం ఉంటుందన్నారు. యువత ఓట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నారు. టిడిపి, జనసేన ప్రభుత్వం వస్తే జరిగే మేలు ఏంటో ప్రజలకు వివరించాలని చెప్పారు. వార్డుల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి తమ ప్రభుత్వం వచ్చాక తీరుస్తామన్న భరోసా ఇవ్వాలని చెప్పారు. తాను గెలిచిన తర్వాత కర్నూల్లోని సమస్యలన్నీ పరిష్కరించి ప్రజలకు మెరుగైన భవిష్యత్తు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాలన్నీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు మన్సూర్ ఆలీఖాన్, అబ్బాస్, జేమ్స్, నరసింహులు, జనసేన నేతలు పవన్, అనిత, సతీష్, ప్రకాష్, వార్డు ఇంచార్జీలు, జన సైనికులు, తదితరులు పాల్గొన్నారు.

About Author