PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళకు టిడిపి -జనసేన పెద్దపీట…

1 min read

“కలలకు రెక్కలు” పేరుతో కొత్త పథకం
మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
కడప టిడిపి అసెంబ్లీ అభ్యర్థి మాధవి రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కడప : మహిళా సాధికారత దిశగా టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త పథకం అమలుకు శ్రీకారం చుట్టారు.మహిళల కోసం ప్రత్యేకంగా “కలలకు రెక్కలు “అనే పథకాన్ని రూపొందించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని ఏ ఆడబిడ్డ ఆర్థిక ఇబ్బంధులతో ఇంటికి పరిమితం కాకూడడనే లక్ష్యం తో  నూతన పథకానికి రూపకల్పన చేశారు.ఈ పథకం ద్వారా వృత్తి పరమైన విద్యకు మార్గాలు అందించడం తో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంఇంటర్మీడియట్ పూర్తి చేసిన మహిళలు ప్రొఫెషనల్ కోర్సులు చేసేందుకు తీసుకునే బ్యాంకు లోన్ కు పూర్తి బాధ్యత టిడిపి -జనసేన తీసుకుంటుంది.మధ్యలో విద్యను ఆపేసిన వారు తమ కలలను సాకారం చేసుకొని ఉన్నత విద్య చదివి తమ లక్ష్యాలను సాధించేందుకు ఈ పథకమ్ దోహదపడుతుంది.ఈ పథకం వల్ల మహిళల్లో ఆర్థిక, జీవన ప్రమాణాలు పెరుగుతాయి.మహిళా దినోత్సవం సందర్బంగా నూతన పథకాన్ని ప్రకటించడం అభినందనీయం. 

About Author