PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ అధినేతను కలిసిన డా. పార్థసారధి

1 min read

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే

ఆదోని, పల్లెవెలుగు: టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గురువారం తాడేపల్లి గూడెంలోని ఆయన నివాసంలో  బీజేపీ ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారధి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఎన్డీయే కూటమిలో భాగంగా  ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ ఎంపికకు సహకరించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ సందర్భంగా డా. పార్థసారధి కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లాలోనే ఆదోని అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందని, ప్రగతి పథంలో నడిపేందుకు ప్రత్యేక దృష్టిసారించాలని, ఇందుకు సహకరించాలని చంద్రబాబును కోరినట్లు  బీజేపీ ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారధి వెల్లడించారు. రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, త్వరలో ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్లు  డా. పార్థసారధి తెలిపారు.

About Author