ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాలు…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ,ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు,లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ, భారత్ వికాస్ పరిషత్ ల సంయుక్త ఆధ్వర్యంలో నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో లో ప్రపంచ పర్యావారణ దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని జరిగిన సిటీ స్థాయి ఎన్విరాన్మెంటల్ క్విజ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న రిటైర్డ్ గనులు మరియు భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తాళ్లపాక నటరాజ్ మాట్లడుతూ ప్రతి వ్యక్తీ పర్యావారణ పరిరక్షణలో తనవంతు భాద్యతను గుర్తించాలన్నారు. నీటిని ఆదాచేయడం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ప్రతి ఒక్కరూ అలావాటుచేసుకో్వాలన్నారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ తాసిల్దార్ ఓరి, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి రాయపాటి నాగలక్ష్మి, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

