NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ నేత సాయినాథ్​ శర్మ అనుచరుడి దుకాణం దగ్ధం

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు:కమలాపురం మండలం పెద్ధచెపల్లి మేజర్ పంచాయతీ కేంద్రం లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ అనుచరుడు మహబూబ్ బాష ఆలియాస్ చిరంజీవి పెద్ధచెప్పల్లి బస్టాండ్ లో నిర్వహిస్తున్న కూరగాయల దుకాణాన్ని గుర్తు తెలియని దుండగులు గురువారం తెల్లవారు జామున దగ్ధం చేసారు.పెద్దచెప్పల్లి గ్రామంలో చిరంజీవి గత పదేళ్లుగా  జీవనోపాధికోసం కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నారు చిరంజీవి నిరుపేద కావడంతో సాయినాథ్ శర్మ తన సొంత స్థలం లో ఎటువంటి అద్దె లేకుండా చిరంజీవి కి దుకాణం నిర్వహించికోవడానికి ఇచ్చారు. గతంలో కూడా చిరంజీవి దుకాణం మూడు సార్లు దుకాణం దగ్ధం చేసారు. మరలా పెట్టుబోడి పెట్టి సాయినాథ్ శర్మ స్థలం లో  నిర్వహిస్తున్న కూరగాయల దుకాణాన్ని మరలా దుండగులు దగ్ధం చేయడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.. కాగా కమలాపురం ప్రాంతంలో ఇటీవల మారుతున్న రాజకీయా పరిణామాల నేపథ్యంలో సాయినాథ్ శర్మ కు పట్టు కలిగిన పెద్దచెప్పల్లి లో ఆయన అనుచరుడి దుకాణం దగ్ధం చేయడం వెనుక మతలబుఎంటనో చర్చ ప్రజల్లో తీవ్ర చర్చనీయాంసంగా మారింది.

About Author