PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌హ‌దారులపై గోతులు పూడ్చిన టీడీపీ నేత‌లు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తెలుగు దేశం పార్టీ నేత‌లు ర‌హ‌దారుల‌పై గోతులు పూడ్చే కార్యక్రమం చేప‌ట్టారు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ర‌హ‌దారులను ప‌ట్టించుకోని నేప‌థ్యంలో తెలుగుదేశం నేత‌లు ఈ కార్యక్రమం చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని చేప‌ట్టాయి. ర‌హ‌దారులు ప్రాణాంత‌కంగా మారాయ‌ని టీడీపీ నేత చింత‌మ‌నేని ప్రభాక‌ర్ అన్నారు. ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకే గోతులు పూడ్చే కార్యక్రమం చేప‌ట్టినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేప‌ట్టారు.

About Author