PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు మానుకోవాలి

1 min read

– వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్​ మద్దయ్య
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: టిడిపి నాయకుల బూతు వ్యాఖ్యలపై నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్​ మద్దయ్య. నగరంలోని ధర్నా చౌక్ లో గురువారం వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే ఎం.ఎ. హాఫిజ్ ఖాన్ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీహెచ్​ మద్దయ్య, వైసీపీ నాయకుడు కేదార్​నాథ్​ మాట్లాడుతూ రాష్ట్రంలో సుభిక్ష పాలన అందిస్తున్న సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డిపై ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక… టీడీపీ నాయకులు దిగజారుతున్నారని ఆరోపించారు.

అధికారం లేక చంద్రబాబుకు మతిభ్రమించిందని, అందుకే వారి అనునూయులతో ముఖ్యమంత్రిని తిట్టడం మొదలు పెట్టారని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ది తెచ్చుకుని ముఖ్యమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ లు కాశీ రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, కైప పద్మాలత రెడ్డి, సుజాత, రాజేశ్వర్ రెడ్డి, నాయకులు రియాజ్ బాబా, ఆది మోహన్ రెడ్డి, నవీన్, చాట్ల నవీన్, సాతర్ల రాజేష్, బంగి అనంతయ్య, శేషు యాదవ్, పర్వేజ్, నయీమ్ బాషా, అంజాద్ బాషా, లక్ష్మణ్, కరుణాకర్ రెడ్డి, కెవి సుబ్బారెడ్డి, మహిళలు వేదవతి,వెంకటేశ్వరమ్మ,సుచరిత,సుహాసిని,గరిబా, తదితరులు పాల్గొన్నారు.


About Author