NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన టిడిపి నేతలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ ఆధ్వర్యంలో టిడిపి నేతలు కర్నూలు నగరంలోని పాత బస్టాండులో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. దేశంలోనే మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడన్నారు. అన్యాయంగా చంద్రబాబును అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నారు.రాజకీయంగా ఆయనను ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎన్నికల్లో ప్రజలు సరైన విధంగా బుద్దిచెబుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు నాగరాజు యాదవ్, మన్సూర్ ఆలీఖాన్, హమీద్, రాజ్యలక్ష్మి, శ్రీధర్, వినోద్ చౌదరి, రాజ్ కుమార్, బొల్లెద్దుల రామక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.

About Author