PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేద కుటుంబానికి బాసటగా నిలిచిన టిడిపి నాయకులు

1 min read

సొంగా రోషన్ కుమార్..
పేదల పాలిట పెన్నిదంటూ పలువురు కృతజ్ఞతలు
పల్లెవెలుగు వెబ్ జంగారెడ్డిగూడెం: మండలం పుట్లగట్లగుడెం గ్రామం లోని విభిన్న ప్రతిభావంతుడు అయిన గుఱ్ఱం మనోహర్ తల్లితండ్రులు ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదని కనీసం పెన్షన్ కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడిగిన వెంటనే వైద్య ఖర్చుల నిమిత్తం నెలకు రెండు వేలు చొప్పున సంవత్సరానికి 24,000 రూపాయలు వారి కుటుంబానికి అందిస్తానని సొంగా రోషన్ కుమార్ తెలిపారు. గత మూడు నెలల నుండి నెలకు రెండు వేలు అందించడం,మానవతా దృక్పధంతో సహాయం అందించిన రోషన్ కుమార్ గారికి తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం గత మూడు నెలలుగా పేద కుటుంబంనకు నెలకు రెండు వేలు ఇస్తున్న చింతలపూడి నియోజకవర్గం టీడీపీ నాయకులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియచేశారు. మాజీ జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, గ్రామ అధ్యక్షుడు ప్రగడ వెంకటేశ్వరరావు,ఎంపీటీసీ సాయిల రాంబాబు, అద్దేపల్లి రవి,దొప్పశని పండు, మూలకాల కొండయ్య, బాదరాల వీరబాబు, గుర్రం అంజిబాబు, చెన్ను బోయిన అంజిబాబు,గంటా రాము , గుఱ్ఱం రాంబాబు, మెరుగు శాండీ, తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.

About Author