PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానవత్వం చాటుకున్న టీడీపీ నాయకులు

1 min read

– సొంగా రోషన్ కుమార్
పల్లెవెలుగు వెబ్ చింతలపూడి : జీలకర్రగూడెంలో ఒక ఫంక్షన్ కి హాజరయ్యి వస్తుండగా సొంగ రోషన్ కుమార్ తిరుగు ప్రయాణంలో ఏలూరు మార్గo మధ్యలో బలివే రోడ్డు సమీపాన ప్రమాదవశాత్తు బైక్ ప్రమాదానికి గురైన గారపాటి లక్ష్మీనారాయణ ప్రమాదానికి గురై వ్యక్తి కంటపడ్డాడు. రోషన్ కుమార్ వెళుతున్న కారు దిగి వెంటనే సకాలంలో స్పందించి ఆయన కారులోనే మెరుగైన వైద్యం కొరకు ఆంధ్ర హాస్పిటల్ కు ఉటాహూటీన పంపించడం జరిగింది. ఆయన మరల ఆర్టీసీ బస్సులో ఏలూరు తిరుగు ప్రయాణమయ్యారు. ఆంధ్ర హాస్పిటల్ కు వెళ్లి దగ్గరుండి డాక్టర్లను సంప్రదించి వైద్య వివరాలు తెలుసుకుని మెరుగైన వైద్యం చేయించటం జరిగింది, అక్కడ ఉన్న స్థానికులు సొంగా రోషన్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రమాదస్థలిలో సహకరించిన సహాయం చేసిన వారికి రోషన్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

About Author