PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం.. సంబరాల్లో వైసీపీ

1 min read


పల్లెవెలుగు వెబ్: టీడీపీ కంచుకోట కుప్పంలో అధికార వైసీపీ పాగా వేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో తాను, తన కుమారుడు లోకేష్ కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. తొలిసారిగా కుప్పం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుని చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. మొత్తం 25 వార్డుల్లో వైసీపీ 19 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా.. టీడీపీ కేవలం ఆరు వార్డులకే పరిమితమైంది. కుప్పం విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. చంద్రబాబు సొంత నియోజకర్గంలో టీడీపీ ఘోర ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం మున్సిపాలిటీపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సంక్షేమ పథకాలు కుప్పంలోని ప్రతి గడపకు తీసుకెళ్లి ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కన్నా వైసీపీ హయాంలోనే కుప్పం బాగా అభివృద్ధి చెందిందన్న మాట సర్వత్రా వినిపిస్తుంది. ఇలా పలు అంశాలు వైసీపీ గెలుపునకు దోహదపడ్డయి.

About Author