PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శాస‌న‌మండ‌లి నుంచి టీడీపీ స‌భ్యులు సస్పెండ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ శాసనమండలి నుంచి ఎనిమిది మంది టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. గురువారం ఉయదం సభ మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు తమ ఆదోళనను కొనసాగించారు. మధ్యపాన నిషేధం, కల్తీసారాపై చర్చకు టీడీపీ ఎమ్మెల్సీలు పట్టుపట్టారు. సభ్యులు ప్రభుత్వ భజన చేస్తున్నారంటూ మండలిలో తెలుగుదేశం నేతలు చిడతలు వాయించారు. టీడీపీ ఎమ్మెల్సీలు సభలో చిడతలు వాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేయాలని మంత్రి కన్నబాబు కోరారు. దీంతో టీడీపీ సభ్యులు బచ్చుల అర్జునుడు, అశోక్ బాబు, దీపక్ రెడ్డి, కేఈ ప్రభాకర్, రాజసింహులు, అంగర రామ్మెహన్, దువ్వారపు రామారావు, బీటెక్ రవిని మండలి ఛైర్మన్ ఒక రోజు పాటు స‌స్పెండ్ చేశారు.

                                                       

About Author