NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కప్పల్ నగర్లో టిడిపి నగరమా మేలుకో కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరంలోని 45వ వార్డు కప్పల్ నగర్ లో తెలుగుదేశం పార్టీ నగరమా మేలుకో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టీజీ భరత్ తో పాటు నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. వార్డులోని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వివరించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. వార్డుకు వచ్చిన టిడిపి నేతలకు స్థానికులు సమస్యలు చెప్పుకున్నారు  దోమల బెడద తీవ్రంగా ఉందని.. ఈ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూల్ లో ఎటు చూసినా దోమలు ఎక్కువయ్యాయన్నారు. నగరంలో పారిశుద్ధ్య పనులు సరిగ్గా చేయడం లేదని.. వీధుల్లో దోమల నివారణకు హైపో ద్రావణం పిచికారీ చేస్తే దోమల సమస్య ఉండదన్నారు. కార్యక్రమంలో నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుంకన్న, అబ్బాస్, రవి, రామాంజనేయులు, గున్నా మార్క్, ఉదయ్ , నాగరాజు, సుందర రాజు, రాజ్ కుమార్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author