PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

25వ వార్డులో టిడిపి న‌గ‌ర‌మా మేలుకో కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూలు న‌గ‌రంలోని 25వ వార్డు హౌసింగ్ బోర్డు ప్రాంతంలో తెలుగుదేశం పిలుస్తోంది న‌గ‌ర‌మా మేలుకో కార్యక్రమం నిర్వహించారు. న‌గ‌ర అధ్యక్షుడు నాగ‌రాజు యాద‌వ్‌, పార్టీ సీనియ‌ర్ నేత‌లు మ‌న్సూర్ ఆలీఖాన్‌, అబ్బాస్‌లు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాల‌ని కోరారు. ఈ ప్రభుత్వంలో అన్ని ధ‌ర‌లు పెరిగిపోయాయ‌ని.. టిడిపి వ‌స్తే ధ‌ర‌లు నియంత్ర‌ణ‌లో ఉంటాయ‌ని వివ‌రించారు. క‌ర్నూల్లో టి.జి భ‌ర‌త్ ను ఎమ్మెల్యేగా గెలిపించాల‌ని కోరారు. ఆయ‌న గెలిస్తే ప్ర‌జ‌లంద‌రికీ ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్నారు. యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాల‌తో పాటు అంద‌రికీ ఉపాధి దొరుకుతుంద‌న్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మంచి సంక్షేమ ప‌థ‌కాలు అందుతాయ‌న్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయ‌కులు రాజ‌శేఖ‌ర్ యాద‌వ్‌, సుధాక‌ర్ రెడ్డి, మ‌హేష్‌, బూత్ ఇంచార్జీలు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నేతలు, మహిళా నాయకురాళ్లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author