NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విధ్వంసం చేయడంలో ఆయన్ను మించినోడు లేడు: లోకేష్

1 min read


పల్లెవెలుగు వెబ్: సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. వ్యవస్థలను విధ్వంసం చేయడంలో జగన్ ను మించినోడు లేడని ఎద్దేవా చేశారు. పంచాయతీలను ఏకగ్రీవం చేస్తే.. గ్రామాల రూపురేఖలు మారుస్తానన్న జగన్.. ఇప్పుడు ఏకంగా పంచాయతీల ఖాతాల్లో ఉన్న సొమ్మును కాజేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్లో విద్యుత్ బకాయిలంటూ రూ.345 కోట్లు వెనక్కి తీసుకోగా.. తాజాగా 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ.965 కోట్లనూ పక్కదారి పట్టించారని లోకేష్ ఆరోపించారు. ఇలా చేయడంతో గ్రామీణాభివృద్ధికి కుంటు పడుతుందన్నారు. వెంటనే పంచాయతీల సొమ్మును తిరిగి వాటి ఖాతాల్లో జమ చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

About Author