PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ ఎన్​ఆర్​ఐ.. సంబరాలు

1 min read

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో: నారా చంద్రబాబుకు బెయిల్  వచ్చిన  శుభ సందర్బంగా NRI TDP CELL కార్యవర్గం ఆధ్వర్యంలో కువైట్లోని హవాల్లి ప్రాంతంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగిందని కువైట్ లోని  అహ్మదీ గవర్న రేట్ మైనార్టీ అధ్యక్షుడు  షేక్ చాన్ భాష తెలిపారు  . ఈ సందర్బంగా ఎన్నారై  టీడీపీ సెల్ కువైట్ కోశాధికారి ఏనుగొండ నరసింహ నాయుడు మాట్లాడుతూ బాబు గారికీ బెయిల్ రావడం మరియు ఈ వైసీపీ పెట్టిన అక్రమ కేసులు కొట్టేసి రాబోయే రోజులో స్క్వాష్ పిటిషన్ ద్వారా నిర్దోషిగా బయటకు వస్తారని కోరుకోవడం జరిగింది. అలాగే ఎన్నారై టీడీపీ కువైట్ అహ్మది గవర్నరేట్ కో ఆర్డినేటర్ ఈడుపుగంటి దుర్గాప్రసాద్,అహ్మది గవర్నరేట్ మైనారిటీ అధ్యక్షుడు షైక్ చాన్ బాషా, గుదే శంకర్ నాయుడు , కడలి రవి శ్రీరామ్,సుదర్శన్ కొండిశెట్టి, సుబ్బయ్య, శంకరయ్య పాల్గొని చంద్రబాబు గారి మీద జరిగిన కుట్రలు ఎదుర్కొని బెయిల్ మీద రావడం మొదటి విజయంగా భావిస్తూ  తెలుగుదేశం కార్యకర్తలకు ముందుగా వచ్చిన దీపావళి పండుగగా భావిస్తున్నామని అని తెలియచేసారు. చంద్రబాబు గారికి ఇదే విధంగా NRI తెలుగుదేశం కువైట్ కార్యకర్తలుగా మా వంతు తెలుగుదేశం విజయానికి కృషి చేస్తామని తెలియజేయడం  జరిగింది.

About Author