PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెల్ఫీ చాలెంజ్ విసిరిన టిడిపి పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ కోసిగి: మంత్రాలయం నియోజకవర్గం లో గతంలో కోసిగి లో పులికనుమ ప్రాజెక్టు పనులు నిలచిపోతే తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత మంత్రాలయం నియోజకవర్గం ప్రజలకు, త్రాగు నీరు, సాగునీరు అందించాలని పులి కనుమ ప్రాజెక్టు నుండి సుమారు 25000 ఎకరాలకు నీరు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి 80 కోట్ల రూపాయలు వెచ్చించి పనులు పూర్తి చేశారు. ఇపుడు ఉన్న వైయస్సార్ ప్రభుత్వం సాగు నీరు, త్రాగు నీరు అందిచకుండ వైయస్సార్ నాయకులు దానిని చేపలు చెరువు గా మార్చారు, ఈ వైయస్సార్ ప్రభుత్వం లో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేక పోయారు కేవలం మాటలు మాత్రమే చెబుతూ పబ్బం గడుపుతున్నారు.

About Author