PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక పట్ల పలువురు హర్షం

1 min read

కే. సురేష్ కుమార్  ను ఘనంగా సన్మానించిన పత్తికొండ బార్ అసోసియేషన్             

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  ప్రముఖ న్యాయవాది తెలుగుదేశం పార్టీ సీనియర్ న్యాయవాది కే సురేష్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శిగా ఎంపిక చేయడం పట్ల స్థానికంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పత్తికొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాది కే సురేష్ కుమార్ ను గురువారం  ఘనంగా సన్మానించారు. సీనియర్ న్యాయవాది సురేష్ కుమార్  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శిగా ఎన్నుకోవడం గర్వకారణమని సీనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. పత్తికొండ భార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తోటి న్యాయవాదులు కే సురేష్ కుమార్ కు పూలమాలలు సాలువాలు తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులు ప్రసంగిస్తూ సీనియర్ న్యాయవాది సురేష్ కుమార్ గారు తన న్యాయవాద వృత్తిని ఎంతో గౌరవప్రదంగా, క్రమశిక్షణగా నిర్వహిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా టిడిపి తరఫున లీగల్ విభాగంలో ప్రతి విషయానికి తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించేవాడని దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశంపార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం ఆయన ఇచ్చిన సముచిత గౌరవం అని పేర్కొన్నారు. సురేష్ కుమార్  భవిష్యత్తులో లీగల్ విభాగంలో ఎన్నో పదవులు చేపట్టాలని న్యాయవాదులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ కృష్ణయ్య, కార్యదర్శి బి రంగస్వామి, సీనియర్ న్యాయవాదులు ఎల్లారెడ్డి, మై రాముడు, సత్యనారాయణ, హెచ్ కె లక్ష్మన్న, నాగభూషణoరెడ్డి, శేఖర్, రమేష్ బాబు, సురేంద్ర కుమార్, సుధా కృష్ణ, మహేష్, దామోదర చారి, ఏ జి పి. నరసింహయ్, తదితరులు పాల్గొన్నారు.

About Author