PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ హామీలు గాలిలో దీపంలాంటివి

1 min read

ప్రతిపక్ష పార్టీ హామీలను నమ్మిమోసపోవద్దు

సీఎం జగనన్న తోనే సంక్షేమ పాలన సాధ్యం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  భవిష్యత్తు గ్యారెంటీతో  టీడీపీ నాయకులు చెపుతున్న హామీలు గాలిలో డిపంలాంటివని ఆ హామీలను నమ్మిమోసపోవద్దని సీఎం జగనన్న తోనే సంక్షేమ పాలన సాధ్యమని మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నందికొట్కూరు మున్సిపాలిటీ లోని 12 వ సచివాలయం పరిధిలో 10 వ వార్డు, 26వ వార్డుల్లో  వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర శాప్ చైర్మన్  బైరెడ్డి సిద్దార్థ రెడ్డి  ఆదేశాల మేరకు వై ఏపి నీడ్స్ జగన్  కార్యక్రమాన్ని కౌన్సిలర్లు వీరబొమ్మ రూప దేవి, మందాడి వాణి అధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి , నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ రాహత్ జబ్బార్ , మున్సిపల్ వైస్ చైర్మన్ అర్శపోగు ప్రశాంతి , మున్సిపల్ కమిషనర్ కిషోర్ , వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు మన్సూర్ , పట్టణ జేసీఎస్ కన్వీనర్ అబ్బు బక్కర్  పాల్గొన్నారు. అనంతరం 10,26 వ వార్డులో జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా  వార్డుల్లో దాదాపు రూ. 10.20 కోట్లు  నేరుగా లబ్ధి దారుల కాతలో  జమ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్సీపీ జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు హమీద్, చాంద్ బాషా, వైఎస్ఆర్సీపీ జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ ఉస్మాన్ బెగ్, పట్టణ ఉపాధ్యక్షుడు ఉపేంద్ర రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, వీపనగండ్ల శేషిరెడ్డి, కోకిల రమణా రెడ్డి, మందాడి రవీంద్ర రెడ్డి, అబ్దుల్ జబ్బార్, చింతా శ్రీనివాసులు, వీఆర్ శీను, అశోక్,  మంజు హోటల్ సలాం, రైతు సంఘం బాబు, మార్కెట్ రాజు, జగదీశ్వర్ రెడ్డి, కురువ శీను, డి.రమేష్, పి.రమేష్, ఆర్ట్ శీను, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author