PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీకే  కోటా  మద్దతు..!

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణం కోటా వీధికి చెందిన దాదాపు 20 కుటుంబాలు కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీకి మద్దతు ప్రకటించారు. పట్టణానికి చెందిన  కమతం కృష్ణ, కమతం పుల్లారెడ్డి, సుబ్బారెడ్డి, చిన్న సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు, సురేష్, శంకర్, రాజేష్, దినేష్, మహేష్, యుగంధర్, అశోక్, వెంకటేష్, ప్రసాద్, రవి, శివ, మధు, లింగస్వామి, చంద్రశేఖర్, జగదీష్ సోమవారం మాండ్ర శివానంద రెడ్డి కి ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయనతో  సమావేశం అయ్యారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ మద్దతు టీడీపీకి ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ఎస్సి సెల్ ఆర్గనైసింగ్ సెక్రటరీ జయసూర్య, కాతా రమేష్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, నారపురెడ్డి, పట్టణ నాయకులుచిన్న పుల్లారెడ్డి, చంద్రారెడ్డి, ముర్తుజావాలి, జమీల్, రసూల్, మల్లికార్జునరెడ్డి, కృష్ణారెడ్డి, కళాకార్, రాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

About Author