PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు సభకు తరలిన టిడిపి శ్రేణులు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధబేరి అనే కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టుల సందర్శనార్థమై మంగళవారం నందికొట్కూరుకు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓర్వకల్లు విమానాశ్రయంలో దిగిన ఆయన రోడ్డు మార్గాన గారేయపురం,బ్రాహ్మణ కొట్కూరు మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన నందికొట్కూరు పట్టణంలోకి ప్రవేశించారు.మిడుతూరు మండల టిడిపి కన్వీనర్ కాత రమేష్ రెడ్డి మరియు మండల నాయకులు వంగాల శివరామిరెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పట్టణంలో బానా సంచా కాలుస్తూ చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. మిడుతూరు,తలముడిపి, జలకనూరు,చెరుకుచెర్ల,  దేవనూరు,కలమందలపాడు, 49బన్నూరు,చౌటుకూరు, కడుమూరు,పైపాలెం,నాగలూటి తదితర గ్రామాలలో వాహనాల్లో కార్యకర్తలు తరలి వెళ్లారు.ఈకార్యక్రమంలో వివిధ గ్రామాల టిడిపి నాయకులు జలకనూరు సర్పంచ్ కురువ ఎల్లయ్య,మాజీ సర్పంచ్ నాగేంద్రుడు,మొల్ల చాకర్ వలి,సర్వోత్తమ రెడ్డి,సంపంగి రవీంద్రబాబు,రమణారెడ్డి,ఇద్రిస్, సుభాన్,బన్నూరు రమణారెడ్డి,సోపిసాహెబ్,గోకారి,ఐటిడిపి మండల కన్వీనర్ ఇంతియాజ్ దితరులు పాల్గొన్నారు.

About Author