PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

23వ రోజుకు చేరిన టిడిపి రిలే నిరాహార దీక్షలు 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి కే.ఈ.శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద టిడిపి చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడాన్ని ఖండిస్తూ, బాబు గారికి తోడుగా… ఒక్క నియంతపై  పోరాటం కోసం మేము సైతంలో భాగంగా గురువారం తుగ్గలి మండలం నల్లగుండ్ల, నునుసరాళ్ల గ్రామస్థులు రీలే నిరాహారదీ శిబిరం వద్దకు చేరుకొని  దీక్షలు చేపడుతున్న వారికీ సంఘీభావం తెలుపుతూ, నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఉదయం 8 గంటలకు రిలే నిరాహార దీక్షలను తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కే సాంబశివారెడ్డి, టిడిపి బీసీ సెల్ రాష్ట్ర నాయకులు రామానాయుడు, మనోహర్ చౌదరి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిని వెంకట రాముడు, లక్ష్మీనారాయణ చౌదరి సంజప్ప హోసూరు, పెద్దహుల్తి, నలకదొడ్డి గ్రామాల మాజీ సర్పంచులు శ్రీనివాసులు, తిప్పన్నా, బత్తిని లోకనాథ్, సింగం శ్రీనివాసులు, మీరా హుస్సేన్, శ్రీనివాసులు గౌడు, బిటి నాయుడు, గోవింద్ గౌడ్ సురేంద్ర పాల్గొని రిలే నిరాహార దీక్షలలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గం టిడిపి శ్రేణులు,  టైలర్ల సంఘం నాయకులు చుక్కప్ప, తిక్క స్వామి, గోపాల్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

About Author