NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ సర్పంచ్ కుటుంబం..రూ 4.36లక్షలు లబ్ధి..

1 min read

పల్లెవెలుగువెబ్​, అన్నమయ్య జిల్లా రాయచోటి: ప్రతిపక్ష పార్టీకి చెందిన లక్కిరెడ్డిపల్లె సర్పంచ్ సద్దల ఆహల్య కుటుంబంలో  జగనన్న ప్రభుత్వంలో వివిధ పథకాల ద్వారా రూ 4.36 లక్షలు లబ్దిపొందారని స్థానిక  ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి  పేర్కొన్నారు.  గురువారము గడప గడప లో భాగంగా ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, గారు లక్కిరెడ్డిపల్లె సర్పంచ్ వారింటికి వెళ్లి సంక్షేమ బావుటా కరపత్రాన్ని అందించారు. వారి కుటుంభానికి  ప్రభుత్వం  అందించిన పథకాలును పేరు పేరునా శ్రీకాంత్ రెడ్డి వారికి వివరించారు. పథకాలు అందడము పట్ల సర్పంచ్ కుటుంభ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కుల,మత, పార్టీలకు అతీతంగా జగనన్న సంక్షేమ పథకాలు అందాయనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. రాయచోటి నియోజకవర్గ పరిధిలో ఇలాంటి టీడీపీ నేతల, కార్యకర్తలు కుటుంబాలు చాలా ఉన్నాయి. జగనన్న మాట కులం చూడం మతం చూడం పార్టీలు చూడం అనే మాటకు ప్రతిరూపం మన ప్రజానేత శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి పరిపాలన ఉంది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

About Author