PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లింలకు మేలు జ‌ర‌గాలంటే టిడిపి రావాలి.. క‌ర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం ప్రభుత్వంలోనే ముస్లింలంద‌రికీ మేలు జ‌రిగింద‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని మౌర్య ఇన్‌లో 4వ వార్డుకు చెందిన ప‌లువురు వైసీపీ నాయ‌కులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టి.జి భ‌ర‌త్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లింల కోసం తీసుకొచ్చిన దుల్హన్ ప‌థ‌కానికి ఈ ప్రభుత్వంలో నిబంధ‌న‌లు పెట్టి అర్హుల‌కు అంద‌కుండా చేశారన్నారు. ప్రతి పేద ముస్లిం రంజాన్ పండుగ‌ను సంతోషంగా జ‌రుపుకోవాల‌ని తీసుకొచ్చిన రంజాన్ తోఫాను సైతం ఈ ప్రభుత్వంలో ఇవ్వడం లేద‌న్నారు. ఇవ‌న్నీ ముస్లింలు గుర్తించాల‌న్నారు. ఏ విధంగా చూసినా ముస్లింల‌కు ల‌బ్ది పొందింది టిడిపి హ‌యాంలోనే అని ఆయ‌న‌ వివ‌రించారు. త‌మను గెలిపించేందుకు ప్రతి ముస్లిం త‌ర‌లిరావాల‌న్నారు. క‌ర్నూల్లో తాను గెలిస్తే ప్రతి ఒక్కరికీ సంక్షేమ ప‌థ‌కాలు అందేలా చ‌ర్యలు తీసుకుంటాన‌ని చెప్పారు. త‌మ ప్రభుత్వంలో తీసుకొచ్చే ఉచిత ఇసుక విధానం వ‌ల్ల భ‌వ‌న నిర్మాణ రంగంలో ప‌నిచేసే వారంద‌రికీ మేలు జ‌రుగుతుంద‌న్నారు. మున్వార్ ఆధ్వర్యంలో అఫ్సర్, మెహ‌బూబ్, ష‌ఫి, హ‌నీష్‌, మాలిక్, ఖాజులు టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి ఊట్ల ర‌మేష్‌, స‌య్యద్ బాషా, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author