PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్​ న్ని నమ్మి మోసపోకుండా.. టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలి..!

1 min read

జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు

సర్పంచ్ పెద్ద స్వామన్న వర్గంతో 500 కుటుంబాలు టిడిపిలో చేరిక.                     

శ్రీశైలంలో భారీమెజార్టీ తో గెలిచి చంద్రబాబు కు కానుకగా ఇస్తా.

శ్రీశైలం టిడిపి అభ్యర్థి , మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.

2 .టీడీపీలో సర్పంచ్ తో పాటు భారీగా చేరిన కార్యకర్తలు. –  

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు : జగనన్న ప్రభుత్వం లో చెడిపోయిన వారు లేరని , ప్రజలు ఒక్కసారి జగన్ కు అవకాశం ఇద్దామని విధ్వంసం చూశారని , మళ్ళీ మోసపోకుండా టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని శ్రీశైలం టిడిపి అభ్యర్థి , మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు.వెలుగోడు మండలం లోని బోయరేవుల గ్రామ సర్పంచ్ వైసీపీ నాయకులు నవనంది పెద్ద స్వామన్న తన భారీ అనుచర వర్గం తో టిడిపి అభ్యర్థి బుడ్డా రాజ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా పార్టీలో చేరారు. బోయరేవుల చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కీ బాణా సంచా కాలుస్తూ , గజ మాలతో , డప్పు వాయిద్యాలతో , పూలు చల్లుతూ ఘనంగా మండల నాయకులు నాగశేఖర్ , సూర్యనారాయణ రెడ్డి , సర్పంచ్ పెద్ద స్వామన్న ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీ గా సభాస్థలి వద్దకు చేరుకుని సర్పంచ్ పెద్ద స్వామన్న, నడిపి స్వామన్న , రాజశేఖర్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి  బుడ్డా సమక్షంలో టిడిపి లో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుడ్డా మాట్లాడుతూ శిల్పా చక్రపాణి రెడ్డి సొంత నిధులు ఖర్చు చేస్తున్నా ప్రతి సారి ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నాడని,అధికార పార్టీ ఎమ్మెల్యే కదా ప్రభుత్వము ద్వారా నిధులు తెప్పించి ఖర్చు చేయచ్చు కదా అన్నారు.99 శాతం హామీలు నెరవేర్చి , అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు. సచివాలయాలు , రైతు భరోసాలు నిర్మించడం తప్ప ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని అన్నారు. టీడీపీ ప్రభుత్వం లో నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే శ్రీశైలం నియోజకవర్గము లో ప్రతిగ్రామాల్లో సిమెంట్ రోడ్లు , పొలాల రస్తాలు , టిజిపి లైనింగ్ కోసం చంద్రబాబు తో కొట్లాడి 350కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. తెలుగు గంగ ద్వారా రైతులకు సమృద్ధిగా సాగునీటి ని అందిస్తే  , లైనింగ్ పనులు 2 ఏళ్ళు లో పూర్తి చేయాల్సింది పోయి ,4 ఏళ్లుగా పనులు సాగదీసి రెండో కారుకు నీరు ఇవ్వకుండా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి  రైతులను మోసగించారని చెప్పారు. కార్యకర్తలను ఏనాడు  గుర్తించకుండా ఇబ్బందులు కల్పించలేదని , వారికి విలువ ఇచ్చి గౌరవించానని , గ్రామాల్లోపనులు చేస్తాము కాబట్టే  ప్రజల్లోకి దైర్యంగా వెళుతున్నామని అన్నారు. శ్రీశైలం లో టిడిపి పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందని , అఖండ మెజారిటీతో గెలిచి చంద్రబాబు కు కానుకగా ఇస్తానని అన్నారు. వైఎస్ ఆర్సిపి నాయకులుఅధికారం లోకి వచ్చాక భయపెట్టి బతుకుతున్నారని ,సొంత కార్యకర్తల మీదనే కేసులు పెట్టి బెదిరించుకుంటున్నారని బుడ్డా విమర్శించారు. ఫ్యాక్షన్ చూసాను , నక్షలైట్లను చూసాను కానీ ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే నాయకునికి సంతృప్తి కలుగుతుందని అందుకే పార్టీ మారనని అన్నారు.వైఎస్ ఆర్ కార్యకర్తలకు  చెబుతున్నా , పెద్ద స్వామన్న ను చూసి కళ్ళు తెరవండని , దైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శిల్పా కొడుకు తో మాట్లాడిస్తున్నాడు, వేల్పనూరు నుంచి ఊరు విడిపిస్తా అంటున్నాడు ,నేను ఎప్పుడూ ఊర్లోని ఉంటా రమ్మను అని బుడ్డా సవాల్ విసిరారు. ఇటువంటి వాళ్ళ ను మళ్ళీ గెలిపించవద్దని అన్నారు. శిల్పా ఐదేళ్లలోఅడ్డంగా దోచుకున్నావు , అధికారం లోకి వచ్చాక అంతా కక్కిస్తానని బుడ్డా అన్నారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖలీల్ , టిడిపినంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్,లాయర్ గోవింద రెడ్డి , మాజీ సర్పంచ్ అబ్దుల్ కలాం ,మొమిన్ రసుల్, టీడీపి మండల అధ్యక్షుడు శేషిరెడ్డి , డా.జాకీర్ , సర్పంచ్ నాగనంది పెద్ద స్వామన్న మండలం లోని టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author