PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్​ అరెస్ట్​!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్​ను బుధవారం ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేత పట్టాభిరామ్​ మంగళవారం ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్​ పట్ల అనిచిత వ్యాఖలు చేస్తూ దుర్భాషలాడిన నేపథ్యంలో పోలీసు శాఖ చర్యలకు ఉప్రకమించింది. ఈమేరకు పట్టాభిని అరెస్టు చేసి భారీ పోలీసుబందోబస్తు నడుమ గవర్నర్​పేట పోలీసుస్టేషన్​కు తరలించారు. పట్టాభిపై 153 ఏ, 505 (2), 504 (ఆర్/ డబ్ల్యూ), 120 బీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పట్టాభి అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య పోలీసుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన భర్తకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని ఆరోపించారు.

About Author