PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగన్వాడి వర్కర్స్ కు మద్దతు తెలిపిన టీడీపీ

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  తమ సమస్యలు పరిష్కరించాలని పత్తికొండలో 22 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడి వర్కర్స్ పత్తికొండ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు మద్దతు తెలిపారు. అంగన్వాడి వర్కర్స్ సమ్మె శిబిరానికి వెళ్లి ఆయన సంఘీభావం ప్రకటించారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు అంగన్వాడి వర్కర్స్ కు ఇచ్చిన హామీలను  నెరవేర్చాలని  డిమాండ్ చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో సమస్యలు పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్నారాణి అన్నారు. జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని చెప్పుకోవడమే తప్ప మహిళలు 22 రోజులుగా రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని చేసుకున్న పాపానికి మహిళలు రోడ్లెక్కల్సిన దుస్థితి వచ్చిందన్నారు. అంగన్వాడీలు ఇళ్ళు, కుటుంబాలను వదిలి రోడ్లెక్కి నిరసనలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేసుకున్న పాపానికి రాబోయే రోజుల్లో అదే ఓటుతో నిన్ను గద్దె దింపుతారని హెచ్చరించారు. రాబోయే టిడిపి ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు కే సాంబశివారెడ్డి, మనోహర్ చౌదరి, అశోక్ కుమార్, తిరుపాలు, సింగం శ్రీనివాసులు, శ్రీనివాసులు గౌడ్, బిటి. గోవిందు, సురేంద్ర కుమార్, ఉచ్చూరప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author