PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండలో టిడిపి విజయోత్సవ ర్యాలీ       

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ బాబు యువ గళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్ర 200 రోజులు ముగిసిన సందర్భంగా పత్తికొండలో గురువారం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుండి నాలుగు స్తంభాల కూడలి మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు విజయోత్సవ ర్యాలీ సాగింది. అనంతరం అంబేద్కర్ సర్కిల్లో జరిగిన భారీ బహిరంగ సభలో శ్యాం కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పాలించడంలో అన్ని విధాల విఫలమైన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పోగాలం దాపరించిందని అన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా 200 రోజులు పూర్తిచేసుకుని విజయ గర్వంతో పాదయాత్ర ముందుకు సాగుతుందన్నారు. అవినీతి బందు ప్రీతి అరాచకాలు దురాక్రమణాలతో జగన్ పాలన సాగిస్తున్నారని ఇంతటితో జగన్ను ఇంటికి పంపే కార్యక్రమాలను చేపడుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి. బాబు వస్తే యువతకు జాబు వస్తుందని నినాదాలతో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున నినదించారు. టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కే సాంబశివారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, అవినీతి అక్రమాలతో కూడుకున్న జగన్ పాలనను అంతమందించేందుకు యువత ముందుకు రావాలని కోరారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు తిరుపాలు ఎస్టీ సెల్ నాయకులు సోమ్లా నాయక్ టి ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు ఎం అశోక్ కుమార్ ఎన్.బి.కె ఫ్యాన్స్ అధ్యక్షులు సింగం శ్రీనివాసులు మీరా హుసేని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిని వెంకట రాముడు టిడిపి నాయకులు తిమ్మయ్య చౌదరి మనోహర్ చౌదరి విజయ మోహన్ రెడ్డి తదితరులు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు.

About Author