PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీని గెలిపిస్తేనే..ప్రజలకు భవిష్యత్​ : టీజీ భరత్​

1 min read

– టిడిపిలో భారీగా చేరిన కారల్ మార్క్స్ నగర్, గడ్డ ప్రాంతాల యువకులు

  • వైసీపీని వీడి టిడిపిలో చేరిన రోజా ప్రాంతం మహిళలు

పల్లెవెలుగు: తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని కారల్ మార్క్స్ నగర్, గడ్డ ప్రాంతం, రోజా ప్రాంతాల నుండి భారీగా యువత, మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భరత్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చి టిడిపివైపు మొగ్గుచూపుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఉంటాయన్నారు. కర్నూల్లో తాను ఎమ్మెల్యే అయితే సమస్యలు పరిష్కరించి, యువత భవిష్యత్తుకు ఒక మార్గం చూపుతానన్నారు. ప్రణాళిక తయారుచేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల్లో మరింత చైతన్యం వచ్చే విధంగా యువకులు బాధ్యత తీసుకోవాలన్నారు. టిడిపిలో చేరిన వారిలో జరీనా, రజియా, నసీమా, యువకులు జుబేర్, హనీఫ్, తోహిద్, సురేష్, జేసెఫ్, రాము, మోదేష్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత మన్సూర్ ఆలీఖాన్, సమీర్, తదితరులు పాల్గొన్నారు.

About Author