PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టిడిపి కార్యకర్తలు

1 min read

– ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్ మోహన్ రాజు

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి మండలం మట్లి గ్రామపంచాయతీ మట్లి వడ్డేపల్లి కు చెందిన  పలువురు టీడీపీ కార్యకర్తలు బుధవారం రాజంపేటలో చంద్రబాబు నాయుడు చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్రలో పాల్గొని రాజంపేట రోడ్డు మార్గమధ్యంలో అదుపుతప్పి స్వల్ప గాయాలయ్యాయి.ఈ ప్రమాదంలో టిడిపి కార్యకర్తలు శ్రీరాములు, రాపూరి ఆదన్న లు గాయపడ్డారు. గాయపడ్డ వారిని గురువారం జగన్ మోహన్ రాజు వారి స్వగృహానికి వెళ్లి ఇరువురిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మీ లాంటి కార్యకర్తలు పార్టీకి  అవసరమని, త్వరలో మీరు కోలుకొని నిండు ఆరోగ్యంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు.ఆయన వెంట మట్లి గ్రామ సర్పంచ్ నాగార్జునాచారి, భూషణ నాయుడు,మండల టిడిపి అధ్యక్షుడు బానుగోపాల్ రాజు,నందకుమార్ నాయుడు, తాటుగుంటపల్లి గ్రామ టిడిపి అధ్యక్షుడు భాస్కర్ రాజు. జయ చంద్రారెడ్డి. బీసీ నాయకులు దుర్గం ఆంజనేయులు. సుధాకర్. నాగప్ప నాయుడు. శశి కుమార. లోకేష. పాలకొండ. పవన్.పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author