PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి మినీ మేనిఫెస్టో భవిష్యత్తుకు గ్యారెంటీపై విస్తృత ప్రచారం           

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో టిడిపి మేనిఫెస్టో భవిష్యత్తు గ్యారెంటీ అనే అంశంపై టిడిపి శ్రేణులు విస్తృత ప్రచారం చేపట్టారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాం కుమార్ ఆధ్వర్యంలో గురువారం  మండలంలోని బింగిదొడ్డి, కషాపురం గ్రామాలలో  భవిష్యత్తుకు గ్యారెంటీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరిస్తూ పరాజ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.  రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా కేఈ శ్యాం కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామాల్లోని ఇంటింటికి తిరుగుతూ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఎలా లబ్ధి చేకూరాతుందో టిడిపి నాయకులు ప్రజలకు వివరించారు. టీడీపీ మినీ మేనిఫెస్టో, భవిష్యత్తు గ్యారెంటీ లో భాగంగా మహాశక్తి పథకం గురించి ప్రచారం నిర్వహించారు. అనంతరం నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి మినీ మ్యానిఫేస్టో ద్వారా కలిగే లబ్దిని వివరిస్తూ, వైసీపీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండలం ముఖ్య నాయకులు, క్లస్టర్, యూనిట్ ,బూత్  ఇన్చార్జిలు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author