NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌దేళ్ల బాలుడి పై టీచ‌ర్ అత్యాచారం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ర‌ంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి ప‌రిధిలో దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. పదేళ్ల బాలుడిపై 25 ఏళ్ల అరబిక్ టీచర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దారుల్ ఉలూమ్ మదర్సా టీచర్ షోయబ్ అక్తర్ వ్యక్తి పైనా బాధితుడి తల్లిదండ్రులు పిర్యాదు చేశారు. పదిరోజులు వరుసగా బాలుడిపై అత్యాచారం చేసినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు. వెన్నునొప్పి ఎక్కువవడంతో బాలుడు ఏడుస్తూ జరిగిన విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులు స్థానికులతో కలిసి మదర్సా ముందు నిరసన వ్యక్తం చేశారు. రెండు నెలలక్రితమే దక్షిణాఫ్రికానుంచి బాలుడి కుటుంబం హైదరాబాద్ తిరిగి వచ్చింది. బాలుడికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆత్యాచారాన్నికి పాల్పడిన అక్తర్ ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

                                        

About Author