PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డీ పౌల్ స్కూలులో  ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: మండల పరిధిలోని కరివేనా లోగల డి పౌల్ స్కూల్  లో ఉపాధ్యాయునీ , ఉపాధ్యాయులు శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు డీపౌల్ స్కూల్ ప్రిన్సిపాల్  ఫాదర్   జై సన్   ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.      ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం     విద్యార్థిని విద్యార్థులు పలు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీపౌల్ స్కూల్ ప్రిన్సిపాల్  ఫాదర్ జై సన్  మాట్లాడుతూ గురువు యొక్క ప్రాముఖ్యతను గురుపూజోత్సవం గురించి వివరించారు. అంతేగాక మన దేశానికి రాష్ట్రపతిగా సేవలందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుంచి ఆయన రాష్ట్రపతిగా ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన పట్టుదల కృషి వల్లనే అంతటి మహోన్నతమైన పదవులను అలంకరించారని , ఆయన మన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులందరికీ దుశ్శాలువ కప్పి , మెమొంటో అందించి పూలమాలవేసి ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయునీ , ఉపాధ్యాయులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు.   ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఫాదర్ వినీత్, ఫాదర్ షాంటో, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

About Author